పీజీఆర్ఎస్లో 55 వినతులు
ABN , Publish Date - May 10 , 2025 | 12:25 AM
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో గిరిజనుల నుంచి అధికారులు 55 వినతులు స్వీకరించారు. సబ్ కలెక్టర్ శౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ కె.చిరంజీవి నాగ వెంకట సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డీఆర్వో, ఎస్డీసీ
పాడేరు, మే 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో గిరిజనుల నుంచి అధికారులు 55 వినతులు స్వీకరించారు. సబ్ కలెక్టర్ శౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ కె.చిరంజీవి నాగ వెంకట సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జి.మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వి.కొండలరావు.. మెయిన్రోడ్డు నుంచి తమ గ్రామానికి సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని కోరారు. హుకుంపేట మండలం కొంతెలి గ్రామానికి చెందిన వర్తన లింగమ్మ తమ ఉమ్మడి భూమిని విభజించాలని అర్జీ అందించారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ కరకపుట్టుకు చెందిన ముడువ రాంబాబు తన భూమిపట్టాలో ఇంటి పేరు తప్పుగా నమోదైందని, సవరణ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. హుకుంపేటకు చెందిన పాడి బాలన్న.. అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు. పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ బొడంగిపాడు గ్రామానికి చెందిన వంతాల లక్మయ్య, గొల్లోరి శ్రీను, కొర్రా సత్యారావు, తదితరులు తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్కుమార్, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, స్థానిక తాహసీల్థార్ వి.త్రినాఽథరావునాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.