Share News

528 మంది మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:18 PM

జిల్లాలో 528 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆ ఉత్తర్వుల కాపీలను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అందజేశారు.

528 మంది మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్‌
మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

మెయిన్‌ అంగన్‌వాడీలుగా ఉన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ

పాడేరురూరల్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 528 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆ ఉత్తర్వుల కాపీలను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అందజేశారు. అంగన్‌వాడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇచ్చిన 5జీ మొబైల్‌ ఫోన్లను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్‌ అందజేశారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తల్లో ఆనందం నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సీహెచ్‌ ఝాన్సీబాయి పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:18 PM