Former Governor : సామాన్యుల్లా శ్రీవారి దర్శనానికి!
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:51 AM
మాజీ గవర్నర్గా తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్య బ్రేక్లో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు ఆదర్శంగా

వీవీఐపీ బ్రేక్లో అవకాశం ఉన్నా సర్వదర్శనం క్యూలో మాజీ గవర్నర్ కుటుంబం
తిరుమల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మాజీ గవర్నర్గా తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్య బ్రేక్లో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు ఆదర్శంగా నిలిచారు. ఆయన గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో దర్శనానికి వెళ్లగా, కుటుంబసభ్యులు మాత్రం శనివారం అర్ధరాత్రి సర్వదర్శనం క్యూలైన్లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు వారంతా క్యూలైన్లోనే ఉండి సాధారణ భక్తులతో కలిసి స్వామి దర్శనం చేసుకోవడం విశేషం.