Share News

Vidadala Gopi Custody: ఏసీబీ కస్టడీకి విడదల గోపి

ABN , Publish Date - May 01 , 2025 | 04:12 AM

పల్నాడు జిల్లాలో స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో విడదల గోపి ఏసీబీ కస్టడీకి ఇచ్చారు. రెండు రోజులపాటు 8 గంటల నుంచి 6 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది

Vidadala Gopi Custody: ఏసీబీ కస్టడీకి విడదల గోపి

గుణదల, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలోని స్టోన్‌ క్రషర్‌ కంపెనీ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ మరిది విడదల గోపి విజయవాడ జైల్లో ఉన్నారు. ఈయనను ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులపాటు కస్టడీకి ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - May 01 , 2025 | 04:12 AM