శ్రీవారి సేవలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:46 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు.

తిరుమల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.