AP High Court: ఇద్దరు జీపీలు, ఓ స్టాండింగ్ కౌన్సిల్ నియామకం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:53 AM
పీ హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు ఎస్.బాలమోహన్రావు..
ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు ఎస్.బాలమోహన్రావు, జీవీఎల్ మూర్తిని ప్రభుత్వ న్యాయవాదులుగా నియమిస్తూ న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది షేక్ కరీముల్లా స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగుతారు. వీరి నియామకానికి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.