Missing : కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:58 AM
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్పై విధు లు నిర్వహించేందుకు వెళ్లిన దీపాలి సుబ్రహ్మ

దారాగంజ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు
తిరుమల, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో డిప్యూటేషన్పై విధు లు నిర్వహించేందుకు వెళ్లిన దీపాలి సుబ్రహ్మ ణ్యం అనే ఉద్యోగి కనిపించకుండా పోయారు. కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్రాజ్లోని సెక్టార్6లో టీటీడీ శ్రీవారి ఆలయ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వహించేందుకు టీటీడీ నుంచి దాదాపు 250 మంది సిబ్బంది డిప్యుటేషన్పై వెళ్లారు. బుధవారం సాయంత్రం సబ్బు కోసం బయటకు వెళ్లిన దీపాలి సుబ్రహ్మణ్యం తిరిగి రాలేదు. దీంతో ఆయన కోసం విజిలెన్స్ అధికారులు తీవ్రంగా గాలించారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో దారాగంజ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.