TTD Chairman : కుంభమేళాలో టీటీడీ చైర్మన్
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:56 AM
మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నమూనా ఆలయాన్ని ఆయన
శ్రీవారి నమూనా ఆలయంలో పూజలు
తిరుమల, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరాది భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నమూనా ఆలయాన్ని ఆయన సోమవారం దర్శించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. 250 మంది టీటీడీ సిబ్బంది నమూనా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.