పారాలీగల్ వలంటీర్లకు శిక్షణ
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:09 AM
పారాలీగల్ వలంటీర్లగా నియమితులైన న్యాయవాదులు, ఇతర రంగాల సామాజిక వేత్తల కు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన, న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి స్థానిక కోర్టు ఆవరణంలో శనివారం శిక్షణ తరగతులను నిర్వహించారు

కదిరిలీగల్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పారాలీగల్ వలంటీర్లగా నియమితులైన న్యాయవాదులు, ఇతర రంగాల సామాజిక వేత్తల కు మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన, న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి స్థానిక కోర్టు ఆవరణంలో శనివారం శిక్షణ తరగతులను నిర్వహించారు. ప్రజలకు చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సులో రెడ్స్ బానూజా జన జాగృతి శ్రీనివాసులు, న్యాయవాదులు లోకేశ్వర్రెడ్డి, వెంకటేష్, దశరథ్, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.