Tirumala Seervar Darshan Wait Time: శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:35 AM
వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఆగస్టు 15, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆదివారాలు కలిసి రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు...
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఆగస్టు 15, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆదివారాలు కలిసి రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిదిషెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులోని అక్టోపస్ భవనం వరకు భక్తులు బారులు తీరారు.