ప్రజా సమస్యలపై అదే నిర్లక్ష్యం
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:45 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై అధికారు లు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు

తనకల్లు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై అధికారు లు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాం తాల్లో తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని చేతులు దులిపేసుకొంటుండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో అసలు అధికారులు ఈ కార్యక్రమానికే హాజరుకావడం లేదు. తనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒక్క తహసీల్దార్ శోభాసువర్ణ మ్మ తప్ప మిగిలిన ఏశాఖాధికారీ హాజరుకాలే దు. ఇలా మండలస్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి గైర్హాజర్ అవుతున్నా .. ఉన్నతాధికారు లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం ప్రజా సమస్యల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.