Share News

ఎమ్మెల్యే కందికుంటకు కృతజ్ఞతలు

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:47 AM

స్వాతం త్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా కూటమి ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంపై సూర్యవంశ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేశారు.

  ఎమ్మెల్యే కందికుంటకు కృతజ్ఞతలు
కదిరి : ఎమ్మెల్యే కందికుంటకు కృతజ్ఞతలు తెలుపుతున్న నాయకులు

కదిరి అర్బన, జనవరి9(ఆంధ్రజ్యోతి): స్వాతం త్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా కూటమి ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంపై సూర్యవంశ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డె ఓబన్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈనెల 11న అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌కు ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయ కులు ఉత్తన్న, వల్లెపు గంగరాజు, కుంచెపు గంగరాజు, ఉత్తన్న, గంగరాజు, నాగార్జున, సురే ష్‌, లక్ష్మీనారాయణ, పీట్ల రమణమ్మ, తిరుపాల్‌, దేవ, కుచ్చెపు శ్రీనివాసులు, క్రిష్టప్ప పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:47 AM