Share News

Vallabhaneni Vamsi: వంశీ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - May 21 , 2025 | 04:10 AM

ఉమ్మడి కృష్ణా జిల్లా అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్‌పై హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. వంశీపై పీటీ వారెంట్‌కు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది.

Vallabhaneni Vamsi: వంశీ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

అమరావతి/విజయవాడ/నూజివీడు టౌన్‌ మే 20(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వాదనలు కొనసాగింపు కోసం విచారణను గురువారానికి వాయిదా వేసింది. పీటీ వారెంట్‌ అమలుపై తాత్కాలిక స్టే విధించింది. వంశీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు వాదనలు కొనసాగింపు కోసం విచారణను గురువారానికి వాయిదా వేశారు.

పీటీ వారెంట్‌కు అనుమతి

వంశీపై దాఖలైన పీటీ వారెంట్‌ను విజయవాడ మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మంగళవారం అనుమతించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వంశీని న్యాయాధికారి ముందు హాజరుపరిచేందుకు గన్నవరంలోని ఎనిమిదో ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఈ కోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో విచారణ విజయవాడలోని మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జరిగింది.

మరో కేసులో..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ను ఏలూరు జిల్లా నూజివీడు కోర్టు పెండింగ్‌లో ఉంచింది. నకిలీపట్టాల పంపిణీ కేసులో కస్టడీ కోరుతూ పోలీసుల దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను ఈనెల 22కు కోర్టు వాయిదా వేయగా, బెయిల్‌ పిటిషన్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:10 AM