Share News

Jagan Mohan Reddy: ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావడం నామోషీనా!:కొల్లు

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:42 AM

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే గెలిపించారు.

Jagan Mohan Reddy: ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావడం నామోషీనా!:కొల్లు

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి రావడాన్ని జగన్‌ నామోషీగా భావిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే గెలిపించారు. అలాంటిది ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్‌ అనడం హాస్యాస్పదం. జగన్‌ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. కానీ ఆయనకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్‌ఫ్లూపై స్వయంగా సీఎం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు’ అని కొల్లు అన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:42 AM