Share News

TDP: పేదలు బిల్లు కట్టకపోతే ఫీజులు పీకుతారు!

ABN , Publish Date - Jan 09 , 2025 | 03:49 AM

పేదలు ఒక నెల కరెంట్‌ బిల్లు కట్టకపోతే ఫీజులు పీక్కెళ్లే అధికారులు..

TDP: పేదలు బిల్లు కట్టకపోతే  ఫీజులు పీకుతారు!

రూ.కోట్లలో బకాయిలు పెడితే వసూలు చేయరా?

టీడీపీ గ్రీవెన్స్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): పేదలు ఒక నెల కరెంట్‌ బిల్లు కట్టకపోతే ఫీజులు పీక్కెళ్లే అధికారులు.. గుంటూరు జిల్లా చినకాకానిలోని టెక్స్‌టైల్స్‌ కంపెనీ రూ.కోట్లలో బకాయి పెట్టి, మూతపడినా, బిల్లు వసూళ్లలో విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యంతో డిస్కంకు భారీ నష్టం జరిగిందని టీడీపీ గ్రీవెన్స్‌లో కె.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలాజీ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అర్జీలు స్వీకరించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసి, తమపై దౌర్జన్యం చేస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని నందివెలుగుకు చెందిన తోటకూర కోటేశ్వరరావు మొరపెట్టుకున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 03:49 AM