ZPTC joins TDP వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జడ్పీటీసీ
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:43 PM
ZPTC joins TDP వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు గూడ ఎండయ్య ఆదివారం రాత్రి ఆ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మె ల్యే మామిడి గోవిందరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
మెళియాపుట్టి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు గూడ ఎండయ్య ఆదివారం రాత్రి ఆ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మె ల్యే మామిడి గోవిందరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కొతూ ్తరు, వెంకటాపురం సర్పంచ్లు బెజ్జి జయ్యమ్మ, గూడ వసంతకుమారి టీడీపీలో చేరారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పాటుపడు తున్నందున టీడీపీ లో చేరినట్లు వారు తెలిపారు. అయితే పార్టీలో చేరికపై కొందరు వ్యతిరేకంగా సోమ వారం సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ నేతలకు తెలుపకుండా చేర్చు కోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి
పాతపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా తాగునీటిఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జడ్పీ సీఈవో ఎల్వీఎన్ శ్రీధర్ రాజా తదితర అధికారులతో సమీక్షిం చారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.