లారీ ఢీకొని వైఎస్ విగ్రహం ధ్వంసం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:16 AM
రూరల్ మండలం బైరి జంక్షన్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖ రరెడ్డి విగ్రహం ఈనెల 20న లారీ ఢీకొని ధ్వంసమైనట్లు శ్రీకా కుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు.
అరసవల్లి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం బైరి జంక్షన్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖ రరెడ్డి విగ్రహం ఈనెల 20న లారీ ఢీకొని ధ్వంసమైనట్లు శ్రీకా కుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపు నాయుడు, రూరల్ ఎస్ఐ రాము కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి లారీ గంగమ్మ రైసు మిల్లుకు 20వ తేదీ సాయంత్రం బయలుదేరింది. బైౖరి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా లారీ వెనుక భాగం తగిలి జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం ధ్వంసమైంది. ఈ విష యాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ మిల్లు యజమానికి తెలిపాడు. వెంటనే లారీ ఓనర్కు కూడా మిల్లు యజమాని విషమయైు సమాచారం ఇచ్చాడు. ధ్వంసమైన విగ్రహాన్ని అదే చోట ఏర్పాటుకు ఆ ఇద్దరు నిర్ణయించారు. అయితే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అసిరినాయుడు ఎవరో విగ్రహం పడగొట్టారని ఫిర్యాదు చేశారన్నారు. పూర్తి వివరాలు తెలుసు కోకుండా ఫిర్యాదులు చేస్తే వర్గాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశముందని, ఎవరూ అలా తప్పుగా ఫిర్యాదు చేయవద్దని కోరారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిందని, ఎవరైనా తప్పుడు సమాచారం పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం, దురుద్దేశాలు లేవన్నారు.