పురుగుమందు డబ్బాతో మహిళ హల్చల్
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:24 AM
స్థానిక పోలీసుస్టేషన్ ముందు శుక్ర వారం ఓ మహిళ ఆత్మహత్య చేసు కుంటానంటూ పురుగు మందు డబ్బాతో హల్చల్ చేసింది.
న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన
నందిగాం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీసుస్టేషన్ ముందు శుక్ర వారం ఓ మహిళ ఆత్మహత్య చేసు కుంటానంటూ పురుగు మందు డబ్బాతో హల్చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలికి చెందిన జోగి రేణుక కు ఆమె భర్తతో గతంలో తగాదా ఉండేది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారిద్దరికి పో లీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో లోక్అదాలత్లో పోలీసులు రాజీ చేయించారు. తన భర్త అన్నివిధాలు గా తన పిల్లలకు, తనను చూసుకుం టానని పోలీసుల సమక్షంలో హామీ ఇచ్చారని, ఇప్పుడేమో పట్టించుకోవ డం లేదు. దీంతో పోలీసులే తనకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ ముందు పుగురమందు డబ్బాతో బైఠాయించి నిరసన తెలిపింది. దీంతో అప్రమత్తమైన అక్కడున్న పోలీసులు ఆమెకు నచ్చ జెప్పి చేతిలో ఉన్న పురుగు మందు డబ్బాను తీసుకున్నారు. అనంతరం రేణుకతో ఎస్ఐ రాము మాట్లాడి, నచ్చజెప్పి ఇంటింకి పంపించారు.