ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:57 PM
అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమపథకాలు అందుతున్నాయని టీడీపీనాయకులు తె లిపారు. గురువారం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమపథకాలు అందుతున్నాయని టీడీపీనాయకులు తె లిపారు. గురువారం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమం నిర్వహించారు.
ఫహిరమండలం ,జూలై3 (ఆంధ్ర జ్యోతి): ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కక్కటి అమలు చేస్తున్నట్లు జడ్పీటీసీ పి.బుచ్చిబాబు తెలిపారు. హిర మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి, ఏడాది పాలనలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథ కాలు, రాష్ట్రాభివృద్ధి గురించి వివరించారు.
ఫకాశీబుగ్గ, జులై 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెర వేర్చినట్లు టీడీపీ రాష్ట్ర బీసీసెల్ కార్యిదర్శి లొడగల కామేశ్వరరావు తెలిపారు. పలా స-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని మూడో వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్య క్రమంనిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికివెళ్లి సంక్షేమ పఽథకాల గురించి అడిగి వివరించారు.కార్యక్రమంలో నాయకులు సవర రాంబాబు, కొండే నరసిం హులు, బాలకృష్ణ, సార నోములు, వెంకటేష్, మాధవరావు, మురళి పాల్గొన్నారు.