ఆటో కార్మికులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:16 AM
ఆటో కార్మికులకు అండగా ఉండి వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వామనమూర్తి అన్నారు.
ఇచ్ఛాపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆటో కార్మికులకు అండగా ఉండి వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వామనమూర్తి అన్నారు. ఆదివారం పట్టణ పరిధి ఆటో యూనియన్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఆటోల ఫిట్నెస్ కోసం ఎచ్చెర్ల వెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహిరించుకొని ఎప్పటీలాగే ఇచ్ఛాపు రంలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి ఆటోయూనియన్ సభ్యులంతా భారీ ర్యాలీ నిర్వహించి మీ సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో ఆటోయూని యన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మోహన్రెడ్డి, హరి, సభ్యులు ఉలాసి ఎర్రయ్యరెడ్డి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.