మునిసిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతాం: విప్
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:36 PM
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో గల 23 వార్డుల్లో పూర్తిస్థాయిలో రహదారులు నిర్మించి సుందరంగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మంగళవారం మునిసిపాలిటీ పరిధిలో గల పలు వార్డుల్లో రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు.
ఇచ్ఛాపురం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో గల 23 వార్డుల్లో పూర్తిస్థాయిలో రహదారులు నిర్మించి సుందరంగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మంగళవారం మునిసిపాలిటీ పరిధిలో గల పలు వార్డుల్లో రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, కమిషనర్ ఎన్.రమేష్, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకరరెడ్డి, టీడీపీ నాయకులు పత్రి తవిటయ్య, ఎన్.కోటి, కాళ్ల దిలీప్, ఆశి లీలారాణి, నందికి జాని, సుభాష్, శ్రీను, రామారావు,శేఖర్ పాల్గొన్నారు.