Share News

బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - May 19 , 2025 | 12:03 AM

కొత్తూరు మండలం వసప గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం రెండు బైక్‌ లు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు

కొత్తూరు, మే 18(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం వసప గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం రెండు బైక్‌ లు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయా య్యా యి. వసప గ్రామం నుంచి కొత్తూరు- నివగాం రహదారిపైకి వస్తుం డగా నివగాం నుంచి కొత్తూరు వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనానికి ఢీకొట్టడంతో కొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. క్షత గాత్రులు గురండి గ్రామానికి చెందిన బోర వినోద్‌, కుంటి భద్రకు చెందిన మహిళగా గుర్తించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని స్థానికులు వైద్యం కోసం కొత్తూరు ఆసు పత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీని వివరణ కోరగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

ఐదుగురు పేకాటరాయుళ్లపై కేసు

కొత్తూరు, మే 18(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం వైఆర్‌పేట గ్రామ తోటల్లో పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం దాడి చేసి ఐదుగురిని పటు కుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ తెలిపారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి వారి నుంచి రూ.5,760 స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:03 AM