ఇది యువత పోరంట!
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:57 PM
Youth protest Student movement వైసీపీ యువజన విభాగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘యువత పోరు’ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత కంటే వృద్ధులే ఎక్కువగా పాల్గొన్నారు.
వైసీపీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇక్కట్లు
శ్రీకాకుళం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ యువజన విభాగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘యువత పోరు’ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత కంటే వృద్ధులే ఎక్కువగా పాల్గొన్నారు. ఇంతవరకు ఏ కార్యక్రమాల్లో కనిపించనివారు సైతం ప్రచార బోర్డులను పట్టుకుని నిరసన చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా... జిల్లాపరిషత్ కార్యాలయం గ్రీవెన్స్ వద్దకు ర్యాలీగా వచ్చిన వైసీపీ నాయకులు.. ఆ పార్టీ కార్యకర్తల తీరుతో ట్రాఫిక్ స్తంభించింది. సాధారణ జనం ఇక్కట్ల పాలయ్యారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద వైసీపీ నాయకుల ర్యాలీని సరిచేసి పంపించారు. వృద్ధులు.. నడివయస్కులు... అధికంగా పాల్గొని ర్యాలీ నిర్వహించడం.. వీళ్లు యువతగా పోరాడటం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.