ప్రధాని సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:46 PM
అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేకఅతిఽథిగా పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలని పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ప్రత్యేక పరిశీలకులు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులను, నాయకులను కోరారు.
పీయూసీ చైర్మన్ కూన రవికుమార్
పొందూరు, జూన్ 19(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేకఅతిఽథిగా పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలని పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ప్రత్యేక పరిశీలకులు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులను, నాయకులను కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సభ విజయవంతంపై నాయకులు, అధి కారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా యువత ఈ సభలో పాల్గొనేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, టీడీపీ నాయకులు ఎ.రాము, చింతాడ వాసుదేవరావు, బలగ శంకరభాస్కర్, సీపాన శ్రీరంగనాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.