Share News

కార్మిక చట్ట సవరణ బిల్లు ఉపసంహరించాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:49 PM

కార్మిక చట్ట సవరణ బిల్లు ఉపసంహరించా లని సీఐటీయూ నాయకుడు పనస రమేష్‌ డిమాండ్‌ చేశారు.

కార్మిక చట్ట సవరణ బిల్లు ఉపసంహరించాలి
కొత్తూరులో ధర్నా చేస్తున్న కార్మిక సంఘ నాయకులు :

కొత్తూరు, సెప్టెంబరు 22(ఆంరఽఽధజ్యోతి): కార్మిక చట్ట సవరణ బిల్లు ఉపసంహరించా లని సీఐటీయూ నాయకుడు పనస రమేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కొత్తూరు నాలుగురోడ్లు జంక్షన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు పది గంటలు పనిని రద్దు చేసి ఎనిమిది గంటలు పని విధా నం అమలుచేయాలని కోరారు. కార్యక్రమంలో శిర్ల ప్రసాదరావు, హరికృష్ణ, ఆనందరా వు, వెంకటరావు, సురేష్‌, రామారావులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:49 PM