సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:37 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశాఖ-ఏ కాలనీలోని తన కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
అరసవల్లి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విశాఖ-ఏ కాలనీలోని తన కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూట మి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రానున్న కాలంలో మరింత అభివృద్ధిని చూస్తారని తెలిపారు.