Share News

బ్యారేజీ ఖాళీ..!

ABN , Publish Date - May 02 , 2025 | 12:00 AM

గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న నీటి నిల్వను వంశధార అధికారులు ఖాళీ చేశారు. గత నాలుగు నెలలుగా ఎగువ ప్రాంతం లో వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది.

బ్యారేజీ ఖాళీ..!
గొట్టాబ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఇసుక మేటలు కనిపిస్తున్న దృశ్యం

హిరమండలం, మే 1(ఆంధ్రజ్యోతి): గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న నీటి నిల్వను వంశధార అధికారులు ఖాళీ చేశారు. గత నాలుగు నెలలుగా ఎగువ ప్రాంతం లో వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. దీంతో బ్యారేజీ వద్ద నీటి నిల్వలు అడుగంటాయి. ఉన్న కొద్దిపాటి నీటిని గేట్లు పైకెత్తి బుధవారం నుంచి కిందకు విడిచిపెట్టారు. దీంతో బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా డీఈఈ సరస్వతి మాట్లా డుతూ బ్యారేజీ గేట్లు ఆరబెట్టేందుకు నీటిని పూర్తిగా కిందకు విడిచిపెట్టామని తెలి పారు. గత ఆరేళ్లుగా బ్యారేజీ గేట్ల మరమ్మతులకు గానీ... గ్రీజు పెట్టేం దుకు కానీ నిధులు మంజూరు చేయకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో వీటి నిర్వ హణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రభుత్వం నిధులు మం జూరు చేస్తే పనులు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 02 , 2025 | 12:00 AM