అగ్రహారం భూ సమస్య పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:53 PM
కొర్లాం అగ్రహా రం పరిధిలోని 250 ఎకరాలు భూ సమస్య పరిష్కరించేం దుకు కృషి చేయాలని ఆ గ్రామ రైతులతో కలిసి విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ కోరారు.
సోంపేట, జూన్ 30(ఆంధ్రజ్యోతి): కొర్లాం అగ్రహా రం పరిధిలోని 250 ఎకరాలు భూ సమస్య పరిష్కరించేం దుకు కృషి చేయాలని ఆ గ్రామ రైతులతో కలిసి విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ కోరారు. ఈ మేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసి ఆ గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అగ్రహారం భూములు సాగుచేస్తున్న రై తుల పేరుతోకాకుండా వేరొకరి పేరుతో నమోదు అ య్యాయని, దీంతో రైతులకు 1బీలు రావడం లేదన్నారు. అందువల్ల ఈ సమస్య పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరడ చంద్రమోహన్, రత్నాల వెంకట రమణ, రాంబుడ్డి గణపతి, సోమేశ్వరరావు ఉన్నారు.