మత్స్యకార కుటుంబానికి తోడ్పాటు: శంకర్
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:47 PM
బందరువాని పేటలో బుధవారం పడవ ప్రమాదంలో మృతి చెందిన బడే గజేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బాధిత కుటుంబానికి గురువారం తక్షణ సాయం రూ.10 వేలు అందించి ఓదార్చారు.
గార రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బందరువాని పేటలో బుధవారం పడవ ప్రమాదంలో మృతి చెందిన బడే గజేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బాధిత కుటుంబానికి గురువారం తక్షణ సాయం రూ.10 వేలు అందించి ఓదార్చారు. అనంతరం వమరవెల్లి, కళింగ పట్నం, తోణంగి పంచాయతీల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు, అభివృద్ధి కార్యక్ర మాలను వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మత్స్య కార నాయకులు పాల్గొన్నారు.