Share News

రీ సర్వేలో సమస్యలు పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:37 PM

మెట్టూరు రెవెన్యూ పరిధిలోగల గునుపల్లిలో రీసర్వేలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పలాస ఆర్డీవో జి.వెంకటేష్‌ పేర్కొన్నారు.

రీ సర్వేలో సమస్యలు పరిష్కారానికి చర్యలు
అర్జీని పరిశీలిస్తున్న ఆర్డీవో వెంకటేష్‌:

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మెట్టూరు రెవెన్యూ పరిధిలోగల గునుపల్లిలో రీసర్వేలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పలాస ఆర్డీవో జి.వెంకటేష్‌ పేర్కొన్నారు. గురువారం గునుపల్లి సచివాలయంలో రీ సర్వేలోసమస్యలను అడిగితెలుసుకుని, అర్జీలను పరిశీలించారు. తనస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, మిగిలిన వాటిపై జేసీతో మాట్లాతానని తెలి పారు. ఇటీవల గునుపల్లిలో ఎయిర్‌పోర్టు నిర్వాసితులతో సమావేశం నిర్వహించిన సమయంలో తమ భూముల్లో రీసర్వేపై అనేక సమస్యలు ఉన్నట్లు రైతులు తెలియ జేశారు. దీంతో గురువారం తహసీల్దార్‌ సీతారామ్మూర్తితో కలిసి రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సులో డీటీ శ్రావన్‌, ఆర్‌ఐ మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:37 PM