ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:19 AM
నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు.
ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
ఎచ్చెర్ల, జూన్ 27(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లా డారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నామన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయ ప్రాంగ ణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, ఎంపీడీవో ఎస్.హరిహ రరావు, తహసీల్దార్ బి.గోపాలరావు, కూటమి నేతలు బెండు మల్లేశ్వరరావు, సంపతిరావు నాగేశ్వరరావు, మెండ రాజారావు, బల్లాడ అరుణ, మూకళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.