రైతు సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:25 AM
రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహా న్తో భేటీ అయి రైతు సమస్యలపై చర్చిం చారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ
శ్రీకాకుళం, జూన్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహా న్తో భేటీ అయి రైతు సమస్యలపై చర్చిం చారు. 2014-19 మధ్యలో చేపట్టిన ఉపాధి పనులకు రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎడిబుల్ ఆయి ల్పై దిగుమతి సుంకం తగ్గింపు వల్ల రాష్ట్రంలో పామాయిల్ రైతులు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జాతీయ వ్యవసాయ కార్పొరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా పప్పు దినుసులను సేకరించే గడువు పెంచాలని కోరారు. సమ స్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.