ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం: డీపీఎం
ABN , Publish Date - May 15 , 2025 | 12:04 AM
కృతి వ్యవసాయంతో భూసారం పెంపొందడంతోపాటు ఆరోగ్యకరమైన పంటలు అందుతాయని పకృతి వ్యవసాయం అదనపు డీపీఎం ఎం.ధనుంజయరావు తెలిపారు. బుధవారం మండలంలోని బొడ్డపాడులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు విరివిగా వాడడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతాయని తెలిపారు.
జలుమూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): పకృతి వ్యవసాయంతో భూసారం పెంపొందడంతోపాటు ఆరోగ్యకరమైన పంటలు అందుతాయని పకృతి వ్యవసాయం అదనపు డీపీఎం ఎం.ధనుంజయరావు తెలిపారు. బుధవారం మండలంలోని బొడ్డపాడులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు విరివిగా వాడడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతాయని తెలిపారు. రసాయన ఎరువుల వల్ల చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నవధాన్యాలు సాగు, పెరటితోటలు పెంపకంపై అవగాహన కల్పించారు. రానున్న ఖరీఫ్లో రైతులు పకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి దామోదర మేరీ, ఐసీఆర్పీలు సాయమ్మ, అమరావతి, పలువురు రైతులు పాల్గొన్నారు.