సామాజిక న్యాయం అమలు చేయాలి
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:36 PM
యూనివర్సిటీ నియామకాల్లో సామాజికన్యాయం అమలు చేయా లని ఎస్టీకమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీని మంగళవారం సందర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రెక్టార్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ పి.సుజాత పాల్గొన్నారు.
ఎచ్చెర్ల, జూలై 15(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ నియామకాల్లో సామాజికన్యాయం అమలు చేయా లని ఎస్టీకమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీని మంగళవారం సందర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రెక్టార్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ పి.సుజాత పాల్గొన్నారు.
ఫశ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 15(ఆంధ్రజ్యో తి): స్థానిక శాంతినగర్ కాలనీలోని గిరిజన సం క్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను డీవీజీ శంకరరావు పరిశీలించారు.
ఫఅరసవల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి):అరసవల్లి సూర్యనారాయణ స్వామిని డీవీజీ శంకరరావు దర్శించుకున్నారు. వారికి ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
ఫ మందస, జూలై15(ఆంధ్రజ్యోతి):గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఎస్టీకమిషన్ చైర్మన్ శంకరరావు తెలిపారు. మందసలో అధికారులు, గిరిజనులతో ముఖాముఖి, సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఫనందిగాం, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని దళిత మహాసభ అధ్యక్షుడు బోకర నారాయణరావు, ఆదివాసీ ఉద్యోగుల జిల్లా ప్రధానకార్యదర్శి కొచ్చ శ్రీను కోరారు. జిల్లాలో పర్యటకు వచ్చిన శంకరరావుకు వినతిపత్రం అందించారు.