‘తల్లికి వందనం’ వర్తింపజేయాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:49 PM
:తల్లికి వందనం పఽథకం ఇం జనీరింగ్ కార్మికులతో పాటు పారిశుధ్యకార్మికులకు వర్తింపజేయా లని ఏపీ మునిసిపల్ వర్కర్స్అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యు లు డిమాండ్చేశారు.
ఇచ్ఛాపురం, జూన్18(ఆంధ్రజ్యోతి):తల్లికి వందనం పఽథకం ఇం జనీరింగ్ కార్మికులతో పాటు పారిశుధ్యకార్మికులకు వర్తింపజేయా లని ఏపీ మునిసిపల్ వర్కర్స్అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యు లు డిమాండ్చేశారు. బుధవారం మునిసిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్పట్నాయక్ మా ట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో ఇబ్బందిప డుతున్న కార్మికులకుటుంబాలను ఆదుకోవాలనికోరారు. ప్రభుత్వపై ఒత్తిడితెచ్చి సంక్షేమపథకాలు అమలుచేయించేందుకు రాష్ట్రవ్యాప్తం గా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని యూనియన్ తీర్మా నించిందని చెప్పారు.అనంతరం కమిషనర్ ఎన్.రమేష్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.