మాజీ సైనికుల సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:51 PM
జిల్లాలోని మాజీ సైనికుల సమస్యలను తెలుసు కుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ, ఆంధ్ర ఆసబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్మిశ్రా అన్నారు.
ఆమదాలవలస, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మాజీ సైనికుల సమస్యలను తెలుసు కుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ, ఆంధ్ర ఆసబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్మిశ్రా అన్నారు. బుధవారం కొత్త రోడ్డు దగ్గర ఉన్న ఆర్మీ క్యాం టీన్ను ఆయన సందర్శించారు. జిల్లాలోని ఉన్న మాజీ సైనికులు, వీరనారీమణులకు ఉపయోగపడే విధంగా ఒక ఈ-రిక్షా అందించనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఏడుగురు విడోస్ మహిళలకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ విక్రాంత్ పాండే, కల్నల్ ఆర్.ఎన్.ముతల్లిక్, జిల్లా ఎక్స్సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ తదితరులు పాల్గొన్నారు.