‘ప్రజాదర్బార్’లో వినతుల స్వీకరణ
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:51 PM
:శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ప్రజాద ర్బార్ నిర్వహించారు. ఈ సం దర్భంగా జిల్లాలో పలుప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
శ్రీకాకుళం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ప్రజాద ర్బార్ నిర్వహించారు. ఈ సం దర్భంగా జిల్లాలో పలుప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
షెడ్ మంజూరుచేయాలి
సోంపేట, సెప్టెంబరు 18 (ఆం ధ్రజ్యోతి):సోంపేటలో వీరబ్రహ్మేం ద్రస్వామి ఆలయ ఆవరణలో షెడ్నిర్మాణం కోసం నిధులు మంజూరూ చే యాలని మాజీ మంత్రి గౌతుశివాజీ కోరారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నా యుడికి టీడీపీ మండలాధ్యక్షుడు మడ్డుకుమార్, సోంపేట పట్టణాధ్యక్షుడు చిత్రాడ శేఖర్, విశ్వబ్రాహ్మణ ప్రతినిధి దేవురాముతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా షెడ్ నిర్మాణానికి రూ 10లక్షలు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.