Share News

వైభవంగా రావణ దహనం

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:50 PM

శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం రాత్రి రావణ దహన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

వైభవంగా రావణ దహనం
శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో రావణుడి దిష్టిబొమ్మ దహనం

అరసవల్లి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం రాత్రి రావణ దహన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్ర మాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన డం ఆనందంగా ఉందన్నారు. చెడుపై విజయమే ఈ రావణదహన కార్యక్రమం అన్నారు. 50 అడుగుల ఎత్తైన రావణుని బొమ్మను తయారుచేసి బాణసంచా వెలుగుల మధ్య కేంద్రమంత్రి విల్లు ఎక్కుపెట్టి దహనం చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:50 PM