ఈస్ట్కోస్ట్ సలహామండలి సభ్యుడిగా రాజేష్
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:54 PM
జేఎన్టీయూ పాలకమం డలి సభ్యుడు, ఐతం కళాశాల డీన్ బుడుమూరు రాజేష్, ఈస్ట్కోస్ట్ సం ప్రదింపుల సలహా మండలి బోర్డు సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
అరసవల్లి, సెప్టెంబరు 27(ఆంధ్ర జ్యోతి): జేఎన్టీయూ పాలకమం డలి సభ్యుడు, ఐతం కళాశాల డీన్ బుడుమూరు రాజేష్, ఈస్ట్కోస్ట్ సం ప్రదింపుల సలహా మండలి బోర్డు సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆయనను కేంద్ర పౌరవిమా నయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన బీసీ నాయకుడికి ఈ పదవి రావడం సంతోషంగా ఉందని, భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరో హించాలని ఆకాంక్షించారు.