సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - May 09 , 2025 | 11:42 PM
ప్రజాసంక్షేమమే ప్రాధాన్యతగా పాలన సాగు తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.పాతపట్నంలోని రాళ్లక్వారీవీధికిచెందిన పోతలసోమేశ్ కుమారుడు విజయ్ కిడ్నీసంబందిత వ్యాధితో బాధపడేవాడు.వైద్యం చేయించుకొనేందుకు ఆర్థికస్థోమతలేకపోవడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు.

పాతపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమమే ప్రాధాన్యతగా పాలన సాగు తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.పాతపట్నంలోని రాళ్లక్వారీవీధికిచెందిన పోతలసోమేశ్ కుమారుడు విజయ్ కిడ్నీసంబందిత వ్యాధితో బాధపడేవాడు.వైద్యం చేయించుకొనేందుకు ఆర్థికస్థోమతలేకపోవడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు. దీంతోఎమ్మెల్యే స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ.నాలుగు లక్షలు మంజూరు చేయించారు.సంబంధిత ఎల్వోసీ పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో శుక్రవారం అందజేశారు.