Share News

ఉమారుద్ర కోటేశ్వరాలయ చైర్మన్‌గా ‘పాండ్రంకి’

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:55 PM

బలరామ ప్రతిష్ఠితమైన నగరం లోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్‌గా పాండ్రంకి దేవేంద్ర నాయుడు నియమితులయ్యారు.

ఉమారుద్ర కోటేశ్వరాలయ చైర్మన్‌గా ‘పాండ్రంకి’
ఎమ్మెల్యే శంకర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న దేవేంద్రనాయుడు

అరసవల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): బలరామ ప్రతిష్ఠితమైన నగరం లోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్‌గా పాండ్రంకి దేవేంద్ర నాయుడు నియమితులయ్యారు. ఈ మేరక బుధ వారం దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా కోరాడ రమేష్‌, కఠారి కమల, సాలిహుండాం శ్రీదేవి నియమితుల య్యా రు. దేవేంద్ర నాయుడు 2000-2002 మధ్య కాలంలో ఇదే ఆల యానికి చైర్మన్‌గా వ్యవహరించారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గొండు శంకర్‌ను బుధవారం దేవేంద్రనాయుడు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బూర్లె రమణమ్మ, ఎంవీఆర్‌ మూర్తి, తంగి సూర్యారావు ఉన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:55 PM