ఒక భూమి.. ఎన్నో మలుపులు!
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:52 PM
land.. dispute పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబరు 67లో ఉన్న ప్రభుత పోరంబోకు భూమి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇక్కడ మొత్తం 198 ఎకరాల్లో 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సుడాకు అప్పగించి ప్రభుత్వ లేఅవుట్గా అభివృద్ధి చేస్తోంది. మిగిలిన భూమి అసైన్డ్గా మార్చి కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కడయినా ప్రభుత్వ భూమి చేతులు మారాలంటే ప్రత్యేక కమిటీ వేసి.. ఆ భూమిని అప్పగించాలి. కానీ ఇక్కడ మాత్రం కొనుగోలు పత్రాలతో ఐదెకరాల భూమి.. మొత్తం ఐదుగురు వ్యక్తుల చేతులు మారి చివరకు మిలటరీ పోరంబోకు భూమిగా రూపాంతరం చెందింది. చివరకు ఆ భూమిని కూడా నిరభ్యంతర పత్రాలు తెచ్చుకుని పబ్లిక్గా అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
వివాదం రేపుతున్న సర్వేనెంబరు 67
ప్రభుత్వ స్థలాలు.. ప్రైవేటు వ్యక్తులపరం
కోర్టులో ఉందంటున్న రెవెన్యూశాఖ
గతంలో ఇక్కడే ప్రభుత్వ పౌరసరఫరాల గిడ్డంగి, పెట్రోలు బంకుకు శ్రీకారం
పలాస, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబరు 67లో ఉన్న ప్రభుత పోరంబోకు భూమి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇక్కడ మొత్తం 198 ఎకరాల్లో 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సుడాకు అప్పగించి ప్రభుత్వ లేఅవుట్గా అభివృద్ధి చేస్తోంది. మిగిలిన భూమి అసైన్డ్గా మార్చి కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కడయినా ప్రభుత్వ భూమి చేతులు మారాలంటే ప్రత్యేక కమిటీ వేసి.. ఆ భూమిని అప్పగించాలి. కానీ ఇక్కడ మాత్రం కొనుగోలు పత్రాలతో ఐదెకరాల భూమి.. మొత్తం ఐదుగురు వ్యక్తుల చేతులు మారి చివరకు మిలటరీ పోరంబోకు భూమిగా రూపాంతరం చెందింది. చివరకు ఆ భూమిని కూడా నిరభ్యంతర పత్రాలు తెచ్చుకుని పబ్లిక్గా అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఈ భూమిలోనే 2018లో టీడీపీ ప్రభుత్వం 60 సెంట్ల స్థలంలో ప్రభుత్వ పెట్రోలు బంకు, పౌరసరఫరాల గిడ్డంగి నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.కోటి వ్యయంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, జాయింట్ కలెక్టర్ చక్రధర్బాబు కలిసి శంకుస్థాపన కూడా చేశారు. ఏమి జరిగిందో కానీ ఆ ప్రాంతంలో ప్రస్తుతం శిలాఫలకం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జిరాయితీ భూమి ఎకరా రూ.20కోట్ల వరకూ ఉంది. దీని ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తులకు దఖలు పడిన భూమి విలువ రూ.100 కోట్లన్నమాట.
వివాదం ఏమిటంటే:
తాళాసు ఈశ్వరరావు అనే జీడి వ్యాపారికి అదే సర్వే నెంబరులో మొత్తం ఆరు సెంట్ల స్థలం ప్రభుత్వం నుంచి పట్టా రూపంలో వచ్చింది. ప్రభుత్వ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తామన్న సమయంలో ఇది ప్రభుత్వ బంజరు భూమి, ఇందులో ఎవరికీ పట్టాలు ఇవ్వడం జరగదని, ఇచ్చినా వాటిని ప్రభుత్వ అవసరాలకు స్వాధీనం చేసుకుంటామని అప్పటి రెవెన్యూ అధికారులు చెప్పడంతో ఆయన తన స్థలాన్ని ధారాదత్తం చేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు నందిగాం మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడి నుంచి కొనుగోలు చేశారు. ఆయనకు కూడా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన మాజీ సైనికోద్యోగి నుంచి దఖలు పడినట్లు రికార్డులు ఉన్నాయి. స్థలాన్ని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులూ ఈ స్థలం తమదని, ఆర్మీ ఉద్యోగికి చెందిన ఈ స్థలంలో నిరభ్యంతర పత్రాలు కూడా ఉన్నాయని, పెట్రోలు బంకు, గిడ్డంగులు నిర్మించడానికి వీలు లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణాలకు బ్రేడ్ పడింది.
ఇదే సర్వేనెంబరులో ఆరు సెంట్లు స్థలాన్ని తాను ప్రైవేటు వ్యక్తుల వద ్ద కొనుగోలు చేసినట్లు పద్మనాభపురం గ్రామానికి చెందిన సాహుకారి లక్ష్మికాంతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి పోరాటం చేస్తోంది. ఇందులో తనకు చెందిన స్థలాన్ని కూడా కొంతమంది వ్యాపారులు ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉండగా తాళాసు ఈశ్వరరావు తన స్థలం తనకే చెందాలని పలాస కోర్టులో దావా వేయగా ఆయనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డరు అందించింది. ఈ మేరకు మంగళవారం ఆయన భవన నిర్మాణ కార్మికులను వెంట పెట్టుకుని సర్వేనెంబరు 67లో వివాద స్థలానికి చేరుకుని కంచె నిర్మాణానికి ఉపక్రమించారు. కాగా అప్పటికే కొంతమంది వ్యాపారులు ఆ స్థలాన్ని చదునుచేసి కంచె, ఇతర నిర్మాణాలు చేస్తుండడంతో ఇరువర్గాల మధ్య వాదన చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలనూ పోలీస్స్టేషన్కు తరలించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి నిర్ణయానికి వస్తారని, అంతవరకూ ఇరువర్గాలూ పనులు ప్రారంభించవద్దని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆర్డీవో కార్యాలయంతోపాటు ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్డీవో బంగ్లా వంటి నిర్మాణం కోసం స్థలాలు వెతుకుతున్న అధికారులకు.. ప్రభుత్వ పోరంబోకు స్థలాలుగా గుర్తింపు ఉన్న సర్వేనెంబరు 67 భూములు ఎందుకు కనిపించడం లేదో అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బడాబాబుల ఆధీనంలో ఉన్న ఈ భూములు సేకరిస్తే ప్రభుత్వం, ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తిని వివరణ కోరగా ‘హైకోర్టు ఉత్తర్వులు ఉన్న కారణంగా ఈ భూముల వివాదంలో జోక్యం చేసుకోలేదు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. గతంలో రెవెన్యూశాఖ పౌరసరఫరా గిడ్డంగి, పెట్రోలు బంకు ఏర్పాటుకు స్థలం కేటాయించి భూమిపూజ చేసిన విషయం వాస్తవమే. కోర్టులో వివాదం కారణంగా నిర్మాణం జరగలేదు’ అని తెలిపారు.