ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదు
ABN , Publish Date - May 09 , 2025 | 11:39 PM
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన ప్రజలు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు ఇచ్చారు.

ఆమదాలవలస, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన ప్రజలు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు ఇచ్చారు. కొంతమంది గ్రామ సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత ఉద్యోగులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. విధి విధానాలు, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ లంచాలకు అలవాటు పడినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిని విధుల నుంచి తొలగించడం లేదా వేరే ప్రాంతానికి బదిలీ చేయడం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మినేని చంద్రశేఖర్, నూకరాజు, సనపల అప్పలనాయుడు, కె.ఆంజనేయులు, ఎ.భాస్కరరావు, మురళీధర్ యాదవ్, పి.వి.నరసింహం, బి.గౌరీపతిరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిక
పురపాలక సంఘంలోని 8వ వార్డులోని వైసీపీకి చెందిన వివిధ కుటుంబాల వారు ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్చార్జి దవళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
రణస్థలం, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు నేరుగా తెలసుకొని... వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో సమావేశపు మందిరంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని బాధితులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పింఛన్లు, హౌసింగ్, భూ సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.ప్రసాద్, ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.