Share News

మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:53 PM

మా సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి పారిశుధ్య పనులు బంద్‌ చేస్తామని మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల సంఘ నేతలు హెచ్చరించారు.

మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల ధర్నా
ఆందోళన చేస్తున్న మునిసిపల్‌ పారిశుధ్య కార్మిక సంఘ నేతలు

పలాస, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మా సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి పారిశుధ్య పనులు బంద్‌ చేస్తామని మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల సంఘ నేతలు హెచ్చరించారు. సోమవారం మునిసి పల్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2011-12 నుంచి పీఎఫ్‌ జమ చేయలేదని, పనులు చేసేందుకు పనిముట్లు ఇవ్వడం లేద ని, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో సీఐటీయూ నాయకుడు ఎన్‌.గణపతి, కార్మిక సంఘ నేతలు మురుగన్‌, ఎన్‌.బలరామ్‌, మోహన్‌, వెంకట్‌, రవి, శకుంతల, గురువారి, ఉష, పలువురు పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:53 PM