సామూహికంగా కుంకుమ పూజలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:37 PM
గ్రామదేవత పెంటపోలమ్మ అమ్మవారి జాతర కన్నుల పండువగా సాగుతోంది. శనివారం రెండోరోజు ఆలయంలో మహిళలతో సామూహిక కుంకుమ పూజలు చేయించారు.
పలాస, జూన్ 7(ఆంధ్రజ్యోతి): గ్రామదేవత పెంటపోలమ్మ అమ్మవారి జాతర కన్నుల పండువగా సాగుతోంది. శనివారం రెండోరోజు ఆలయంలో మహిళలతో సామూహిక కుంకుమ పూజలు చేయించారు. ఉదయం 8 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్ర మం నిర్వహించగా అనంతరం అమ్మవారిని భ క్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీధు ల్లో పగటి వేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాశీబుగ్గ ఎల్సి గేటు వద్ద 50 అడుగుల ఎత్త యిన భారీ ఆలయ నమూనాను విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు.