పాముకాటుతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:41 PM
శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీశ్వరరావు(50) ఆదివారం పాముకాటుతో మృతి చెందాడు.
ఎల్ఎన్ పేట, జూలై 13(ఆంధ్రజ్యోతి): శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీశ్వరరావు(50) ఆదివారం పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం సాయంత్రం జగదీశ్వరరావు తన కోళ్లఫారంలోని కోడి తీస్తున్న సమయంలో కోడి కాళ్లగోళ్లు తగిలినట్లుగా అనిపించడంతో పట్టించుకోలేదు. పశువుల కోసం పక్కనే ఉన్న గడ్డికుప్పకు వెళ్లి గడ్డి తీసుకొని ఇంటికివచ్చేసరికి నోటి నుంచి సొంగలు వచ్చాయి. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లే క్రమంలో సరుబుజ్జిలి వచ్చేసరికి చనిపోయాడు. జగదీశ్వరరావుకి భార్య భానుమతి ఉంది.