జాబ్చార్ట్ అమలుచేయాలి
ABN , Publish Date - May 06 , 2025 | 12:11 AM
ఆరు సంవత్సరాలు సర్వీసు పూర్తయిన వారిని రెగ్యులర్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన పెంచాలని, జాబ్ చార్టు అమలుచేయాలని కమ్యూనిటీ హెల్త్ అధికారులు(సీహెచ్వో) కోరారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 5(ఆంధ్రజ్యోతి): ఆరు సంవత్సరాలు సర్వీసు పూర్తయిన వారిని రెగ్యులర్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన పెంచాలని, జాబ్ చార్టు అమలుచేయాలని కమ్యూనిటీ హెల్త్ అధికారులు(సీహెచ్వో) కోరారు.ఈమేరకు సోమవారం శ్రీకాకుళంలోని జ్యోతిరావుపూలే పార్కు వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని సీహెచ్వోలు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. వీరికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు తమ మద్దతు తెలియజేశారు.