ఉద్యోగులపై చిన్నచూపు తగదు
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:20 PM
ఉద్యోగులపైచిన్న చూపు తగదని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని దాసరి క్రాంతి భవన్లో కార్యవర్గ సమా వేశం నిర్వహించారు.
గుజరాతీపేట, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):ఉద్యోగులపైచిన్న చూపు తగదని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని దాసరి క్రాంతి భవన్లో కార్యవర్గ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి డీఏ పెండింగ్లో పెట్టిందని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ, నాయకులు పి. ప్రభాకరరావు ఎం.సన్యాసిరావు, పి.రామకృష్ణ, కె.తేజేశ్వరరావు, జి. శ్రీనివాసరావు, జి.తిరుమలరావు పాల్గొన్నారు.