హొన్నాళి పాఠశాల పరిశీలన
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:47 PM
మందస మండలంలోని హొన్నాళి పాఠశాలను సోమవారం డీఈవో డాక్టర్తిరుమల చైతన్య పరిశీలించారు. పాఠశాల ఎదుట 6,7 తరగతులు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో పాఠశాల కొనసాగిం చాలి..తల్లిదండ్రుల ఆందోళన శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 20న కథనం ప్రచు రితమయ్యింది.
హరిపురం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని హొన్నాళి పాఠశాలను సోమవారం డీఈవో డాక్టర్తిరుమల చైతన్య పరిశీలించారు. పాఠశాల ఎదుట 6,7 తరగతులు కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో పాఠశాల కొనసాగిం చాలి..తల్లిదండ్రుల ఆందోళన శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 20న కథనం ప్రచు రితమయ్యింది. దీంతో డీఈవో పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగితెలు సుకున్నారు.ఈసందర్భంగా ఐదుకిలోమీటర్లు దూరంలోని పీఎస్పురం హైస్కూల్కు తమ పిల్లలు వెళ్లేందుకు మధ్యలో మహేంద్రతనయానది ఉండడంతో ఇబ్బందు లకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. పాఠశాలలో తరగ తులు కొనసాగిస్తే వలంటీర్లను తామే నియమించి బోధన కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.వీరితోపాటు యూటీఎఫ్నాయకులు కిషోర్కుమార్, లండ బాబూరావు, గున్న రమేష్, జగదీష్ బడిత్య, సార భాస్కరరావు డీఈవోకు పాఠశాలలను తెరిపించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.