కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:51 PM
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ పొట్టి జగదీష్ కుటుంబాన్ని రాష్ట్ర పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రతినిధులు శనివారం పరామర్శించారు.
సోంపేట, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ పొట్టి జగదీష్ కుటుంబాన్ని రాష్ట్ర పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రతినిధులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా తక్షణ సాయం కింద లక్ష రూపాయల చెక్ను అతడి భార్య పుష్పకు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణంనాయుడు, ట్రెజరర్ భుజంగరావు తదితరులు ఉన్నారు.